యాదాద్రి భువనగిరి జిల్లా
వలిగొండ పల్లె మండలం
జంగారెడ్డిపల్లి గ్రామం
వాణి న్యూస్
ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తాయని ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పల్లె మండల పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో బద్దం మహేందర్ రెడ్డి అనే రైతు 12 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ…
ఆయిల్ పామ్ సాగు చేసి రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నదని తెలిపారు.
ఈ పంట సాగుతో 4సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు నిరంతర ఆదాయం పొందవచ్చని,చీడపీడల బెడద ఉండదన్నారు. వేరుశనగ, పెసర, మినుము, నువ్వులు, పొద్దుతిరుగుడు,తదితర పంటల ద్వారా ఆదాయం పొందవచ్చన్నారు. బ్యాంకుల ద్వారా రుణ సాయం అందుతుందన్నారు. ఆయిల్ పామ్ సాగుకు దాదాపు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. 20రూపాయలకు మొక్క లభిస్తుందని, ఎకరానికి సమాంతర, త్రిభుజాకార పద్ధతిలో నాటితే 57 మొక్కలు సరిపోతాయని చెప్పారు. ఎకరానికి 1లక్ష 25 వేల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏవో అంజనీ దేవి, మాజీ సింగిల్ విండో చైర్మన్ వాకిటి అనంతరెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ పనుమటి మమతా నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి, సర్పంచ్ శివరాత్రి ఎల్లమ్మ, ఉప సర్పంచ్ శివరాత్రి సాయిలు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎమ్మె లింగస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోలెపాక సత్యనారాయణ, బిక్షపతి రైతులు పాల్గొన్నారు.