రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్ తో పాటు ఫార్మసీ, మేనేజ్మెంట్ తదితర ఉన్నత విద్యా కోర్సులకు కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి.

మూడేళ్లకు ఒకసారి తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (TAFRC) రుసుములను సమీక్షించి కొత్తవాటిని ఖరారు చేస్తుంది. 2025-26 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రావాల్సి ఉంది. ఈ నెలాఖరుకు TAFRC నుంచి నోటిఫికేషన్ జారీ కానుంది.