ఈనెల 27న శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానాన్ని నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.

శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో బంగారు సర్వభూపాల వాహనంపై కృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తామన్నారు. ఈనెల 28న ఉట్లోత్సవం సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.