పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాల కారణంగా కాలుష్యం పెరుగుతోందంటూ ప్రభుత్వం నవంబరు 18న ఈవీ నూతన విధానం అమల్లోకి తెచ్చింది.
రోడ్డు ట్యాక్స్ తో పాటు రిజిస్ట్రేషన్ ఫీజును రవాణాశాఖ పూర్తిగా మినహాయించడంతో డిసెంబరు 3 వరకు 16 రోజుల్లో 3,372 ఎలక్ట్రిక్ వాహనాలు రవాణాశాఖ కార్యాలయాల్లో రిజిస్టర్ అయ్యాయి. గతేడాది ఇదే వ్యవధికి ఆ సంఖ్య 2,708. కొత్త విధానంతో 24.52శాతం వృద్ధి నమోదైంది.