అమెరికా జర్నలిస్టు, రచయిత్రి మాషా గెసెస్కు మాస్కో కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. రష్యన్ సైన్యం గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన కేసులో గెసెస్ను న్యాయస్థానం దోషిగా తేల్చింది.
మాస్కోలో జన్మించిన గెసిన్ ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ విమర్శకురాలిగా ఆమెకు పేరుంది.