కాలంతో సంబంధంలేకుండా శీతల పానీయాల వాడకం పెరిగింది. దాహం వేస్తే ఏం ఆలోచించకుండా సరాసరి కూల్ డ్రింక్ తాగుతున్నారు.

అయితే అలా తాగేవారు చాలా ప్రమాదంలో ఉన్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శీతల పానీయంలో ఎక్కువ మొత్తంలో కృత్రిమ చక్కెరలు వాడతారు. వీటిని రోజూ తీసుకోవడంవల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటికి బదులుగా నిమ్మరసం, కొబ్బరి బోండాం తాగడం ఉత్తమం అంటున్నారు.