నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధ వనంలో బౌద్ధ విశ్వవిద్యాలయం స్థాపన కోసం మలేషియా బుద్ధిస్సంస్థ ముందుకు వచ్చింది.
274ఎకరాల మేర విస్తరించి ఉన్న బుద్ధవనం ప్రాజెక్టులో తమకు అవసరమైన స్థలాన్ని కేటాయించిన పక్షంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. విదేశీసంస్థలకు బుద్ధవనంలో స్థలాల కేటాయింపుపై రాష్ట్రప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.