ఒడిశాలో పిడుగుపాటుకు 15 మంది మృతి చెందారు. రెండు రోజుల వ్యవధిలో శనివారం 9 మంది, ఆదివారం ఆరుగురు చనిపోయారని, పలువురు గాయాలపాలయ్యారని అధికారులు పేర్కొన్నారు.
ఈ ఘటనలపై సీఎం మోహర్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్రేషియా ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్సను కూడా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.