శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా తిరుమలకు బైకుల రాకపోకలపై ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటలవరకు మాత్రమే రెండు ఘాట్రోడ్లలో బైకులను అనుమతించనుంది.
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వన్యప్రాణుల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. భక్తులతోపాటు వన్యప్రాణుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.