రాబోయే ఐదేళ్లలో రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) ప్రణాళికలు రూపొందించింది.

ప్రధానమైన చమురు రిఫైనింగ్, పెట్రోలియం ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు, భవిష్యత్తుకు కీలకమైన హరిత ఇంధనాల విభాగాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ పెట్టుబడులు వినియోగిస్తామని బీపీసీఎల్ ఛైర్మన్ జి.కృష్ణకుమార్ తెలిపారు.