యూకేకు చెందిన ప్రముఖ టెలికాం కంపెనీ బ్రిటిష్ టెలికాం గ్రూప్లో సునీల్ మిత్తల్ నేతృత్వంలోని భారతీ గ్లోబల్ సంస్థ వాటాలు కొనుగోలు చేయనుంది.
ఆల్టిస్ యూకే నుంచి 24.4 వాటా కొనుగోలు చేయనునున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎయిర్టెల్ భారతీ ఎంటర్ప్రైజెస్కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థే ఈ భారతీ గ్లోబల్. భారతీ టెలీవెంచర్స్ యూకే ద్వారా ఈ షేర్లను కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.