ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో పాలరాతి కట్టడం తాజ్ మహల్ ప్రధాన గుమ్మటం వద్ద నీరు లీకవుతున్నట్లు భారత పురావస్తు శాఖ వెల్లడించింది.

గత మూడు రోజులుగా ఆగ్రాలో భారీ వర్షాలు కురవడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఆ నీటి లీకేజీ వల్ల ఎలాంటి నష్టం లేదని స్పష్టంచేసింది. డ్రోన్ కెమెరాల సహాయంతో గుమ్మటం పరిస్థితిని పరిశీలించామని ఆగ్రా సర్కిల్ సూపరింటెండింగ్ చీఫ్ రాజకుమార్ పటేల్ తెలిపారు.