రిపోర్టర్ : దుర్గాప్రసాద్
అధికారం ఉన్న లేకపోయినా పేదవాడికి కష్టం కలిగినప్పుడల్లా కనిపించే జెండా భారత కమ్యూనిస్టు పార్టీ జెండా
ఎర్రజెండాలన్నీ ఏకం కావాలి వందేళ్ళ ఉత్సవాల్లో సందర్భంగా కూనంనేని పిలుపు
ఖమ్మం: ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ముందుగా తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మకు పూలమాలవేసి వేలాది మందితో ర్యాలీని ప్రారంభించారు.
అనంతరం బస్టాండ్ సెంటర్ వద్ద జెండా ఆవిష్కరణ చేసి అనంతరం భక్త రామదాసు కళాక్షేత్రంలో ముందుగా భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ కామ్రేడ్స్ ను సన్మానించుకొని అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ భారత గడ్డపై వందేళ్ళ చరిత్ర కలిగిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని, కార్మిక హక్కుల సాధనకై ప్రజా చైతన్య పోరాటాలకై కష్టం కలిగిన ప్రతి పేదవాడి గుండెచప్పుడు ఈ ఎర్రజెండా అలాంటి ఎర్రజెండా లేదన్న వారికి కమ్యూనిస్టులు లేరని అన్న వారికి కళ్ళు తెరుచుకొని ఒక్కసారి చూడమని చెప్తున్నా అధికారం ఉన్న లేకపోయినా ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని ఈరోజు వందమందితో ఓ కార్యక్రమం చేయాలంటే వేలు, లక్షలు ఖర్చు పెట్టేటువంటి పార్టీలు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వేలాదిమందిని తరలించే శక్తి కలిగినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని కండంతరాలు దాటిన కనపడే ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని, కానీ ప్రాంతం దాటితే కనపడిన పార్టీ నాయకుల మమ్మల్ని విమర్శించేది ఒక్కసారి ఆలోచించుకోండి అధికారం కోసమో ధనం కోసం పార్టీలు మారే వ్యక్తులం కాదు మేము గుర్తుపెట్టుకోండి , మేమే నిజంగా అధికారం కావాలనుకుంటే ఈరోజు ఎన్నో పదవులు అనుభవించే వాళ్ళం అని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ఇంతా కాలం పార్టీకి వెన్ను దన్నుగా ఉండి అంకితభావంతో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు పువ్వాడ నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంత్ రావు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మౌలానా, దండి సురేష్, జెమ్ముల జితేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రజాసంఘాల నాయకులు రావి శివరామకృష్ణ, తోట రామాంజనేయులు, రామకృష్ణ,ఎస్ కే జానీ మియా, తాటి వెంకటేశ్వర్లు, ఏపూరి లతా దేవి, పోటు కళావతి, సీతామహాలక్ష్మి, సిద్ధినేని కరుణకుమార్, మద్దోజు శ్రావణ్ కుమార్, సిపిఐ మండల భద్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.