నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI).. తన భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ(BHIM) యాప్ ను స్వతంత్ర అనుబంధసంస్థగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది.

ఇందులో భాగంగా భీమ్ ఉనికిని విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. దీనికోసం లలితా నటరాజ్ ను భీమ్ సీఈవోగా నియమించింది. ఆమె భీమ్ను వేగంగా జనాల్లోకి తీసుకెళతారని ఆశిస్తోంది. గూగుల్పే, ఫోన్పేపై ప్రజలు ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం భీమను వేగంగా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తోంది.