స్పామ్ కాల్స్ ను అరికట్టేందుకు తాజాగా ప్రైవేట్ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కొత్తగా ఏఐ ఆధారిత స్పామ్ ఫిల్టర్ తీసుకొచ్చింది.

దీన్ని ప్రారంభించిన రెండున్నర నెలల్లో 800 కోట్ల స్పామ్ కాల్స్, 80 కోట్ల స్పామ్ sms లను గుర్తించినట్టు ఎయిర్టెల్ వెల్లడించింది. అత్యధికంగా స్పామ్ కాల్స్, మెసేజ్లను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఢిల్లీ మొదటిస్థానంలో ఉండగా, ఆ తర్వాత ఏపీ, వెస్ట్ యూపీ, కర్ణాటక ఉన్నాయని వివరించింది.