విజయవాడ నుంచి ఢిల్లీకి కొత్తగా మరో విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఈ సేవలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి.

ఉదయం సమయంలో ఢిల్లీకి విమాన సర్వీసు అందుబాటులోకి తేవాలని ప్రజల నుంచి డిమాండ్ రావడంతో కొత్త సర్వీసు నడిపేందుకు ఇండిగో సంస్థ అంగీకరించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు.