దేశంలో ఏనుగులు వృద్ధి చెందడానికి అనుకూలమైన ఆవాసాలను ఏర్పాటు చేయడానికి నిబద్ధతతో ప్రయత్నిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు.
దేశ సంస్కృతి, చరిత్రలో ఏనుగులు భాగంగా ఉన్నాయన్నారు. ఇవాళ వరల్డ్ ఎలిఫెంట్ డే సందర్భంగా వాటి రక్షణకు కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులను (X) లో అభినందించారు. కొన్నేళ్లుగా ఏనుగుల సంఖ్య పెరుగుతూ ఉండటం సంతోషం అన్నారు. దేశంలో 30వేలకుపైగా ఏనుగులు ఉన్నట్లు అంచనా.