రాష్ట్రంలో గత 6నెలల వ్యవధిలో సైబర్ నేరాలకు సంబంధించి ఫోన్ కాల్స్ ద్వారా 25వేల ఫిర్యాదులు అందాయి.
ఆయా నేరాల్లో బాధితులు రూ. 293కోట్లు నష్టపోయారు. అందులో రూ.44కోట్లు నేరగాళ్ల పరం కాకుండా పోలీసులు స్తంభింపజేయగలిగారు. మరో రూ.3.50కోట్లు నేరగాళ్ల నుంచి రాబట్టగలిగారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా.. బుధవారం CM చంద్రబాబు శాంతిభద్రతలపై నిర్వహించే సమీక్షలో ఈ అంశాల్ని వివరించనుంది.