ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో శాసనసభ స్థానాల పెంపు 2026లోనేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026లో జనాభా లెక్కల అనంతరం ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225 శాసనసభ స్థానాలకు, తెలంగాణలో 119 నుంచి 153 శాసనసభ స్థానాలకు పెంచనున్నట్లు లోక్సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.