రాష్ట్రంలో రుణమాఫీపై ఫీల్డ్ సర్వే ప్రారంభమైంది. ఇందులో పలు సమస్యలతో రుణమాఫీ నిలిచిపోయిన రైతుల ఇళ్లకు వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి కుటుంబ సభ్యుల నిర్ధరణను ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 4.24 లక్షల అకౌంట్లను 4 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. వచ్చే శనివారం సాయంత్రం వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని.. ఆ తరువాత వారి అకౌంట్లకు సంబంధించి రుణమాఫీ చేయనున్నట్టు తెలుస్తోంది.