అదానీ గ్రూప్ వ్యవహారంలో తనపై తప్పుడు వార్తలు రాసి పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పలుమీడియా సంస్థలపై ఢిల్లీ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు.

అదానీ గ్రూప్ కేసుకు సంబంధించి తనపేరు లేకున్నా ఉన్నట్లుగా కథనాలు రాసి తన పరువుకు భంగం కలిగించారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.