రాష్ట్రంలో రూ.2 లక్షల లోపు రుణమాఫీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 22,37,848 మంది రైతుల ఖాతాల్లో రూ.17,933 కోట్లు జమ చేసింది.

మొదటి విడత 11,50,193 మందికి సంబంధించి రూ. 6,098.93 , రూ. 6,40,823 మందికి సంబంధించి రూ.6,190.01 కోట్లను రుణ ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం.. మూడో విడతలో గురువారం సాయంత్రానికి రూ.5,644.24 కోట్లను 4,46,832 మంది రైతులకు విడుదల చేసింది.