ఫోన్ ట్యాపింగ్ కేసులో సంయమనం పాటించాలని మీడియాకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈకేసు వ్యవహారంలో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. పలు కీలక సూచనలు చేసింది.

వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్దాంతం చేయొద్దని, జడ్జీలు, వారి కుటుంబసభ్యుల పేర్లు బహిర్గతం చేయొద్దని స్పష్టంచేసింది. ఫోన్ నంబర్లు, ఫొటోలు బహిర్గతం చేయొద్దని సూచించింది. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.