బీఫార్మసీ కౌన్సెలింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఫలితంగా వేలాది మంది MPC, BIPC విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కన్వీనర్ కోటా కింద బీఫార్మసీ సీట్లు సుమారు 10,500 ఉన్నాయి. గత ఏడాది బైపీసీ విద్యార్థులకు సెప్టెంబరు 2వ తేదీన తొలివిడత, 23వ తేదీ నాటికి చివరివిడత కౌన్సెలింగ్ పూర్తయింది. ఈ ఏడాది ఇప్పటివరకు MPC కౌన్సెలింగ్ షెడ్యూలే విడుదల కాలేదు.