డయేరియా నివారణా చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. డయేరియా కట్టడిపై సీఎస్ వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రజలకు రక్షిత తాగునీరు అందించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మంచినీటి పైపులైన్లు, ఓహెచ్ఎస్ఆర్ లీకేజీలు లేకుండా ఆదేశించారు. 217 నీటి వనరులలో కాలుష్యం ఉన్నట్టు గుర్తించినట్టు వెల్లడించారు.