సికింద్రాబాద్ – వాస్కోడగామా మధ్య ప్రవేశపెట్టిన నూతన ఎక్స్ప్రెస్ రైలుకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆదివారం సికింద్రాబాద్ స్టేషన్ లో జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సికింద్రాబాద్ నుంచి గోవాకు ఇప్పటివరకు లింక్ రైలు మాత్రమే ఉండేది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లగా కొత్త సర్వీసును ప్రకటించారు.