రిపోర్టర్. దుర్గా ప్రసాద్.
ఉమ్మడి ఖమ్మం-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని క్రిస్టియన్ సోదరులకు రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు.

మంగళవారం పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహానికి వచ్చిన RCM చర్చి ఫాదర్ విజయరావు, చర్చి నిర్వాహకులు ఆయనకు క్రిస్టమస్ గిఫ్ట్ ఇచ్చారు. అనంతరం కొత్వాల ఆరోగ్యమాత చర్చికి వెళ్లి ఫాదర్ విజయరావును శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారికి *కొత్వాల క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో RCM చర్చి సిస్టర్ మరియా, నిర్వాహకులు చిన్నప్ప, గుర్రం రవి, బొజ్జ రమేష్, P ప్రకాష్, జాబి, థామస్ తదితరులు పాల్గొన్నారు.