హైడ్రా ప్రజావాణికి సోమవారం ఒక్కరోజే 71కి పైగా ఫిర్యాదులు వచ్చాయని హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ తెలిపారు. వీటిని అక్కడికక్కడే అధికారులతో చర్చించి చర్యలకు ఆదేశించారు.

కాలనీల చుట్టూ రహదారులను నిర్మించిన పక్షంలో వాటిని తొలగించాలని సూచించారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా పరిశీలించి.. దశాబ్దం క్రితం ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో అధికారులు తెలుసుకున్నారు.