రానున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ (NC), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (PDP)సంసిద్ధత వ్యక్తం చేశాయని జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా వెల్లడించారు.
NC ఇప్పటికే కేంద్ర నాయకత్వంతో ఈ విషయమై ఇప్పటికే చర్చించినట్లు తనకు తెలిసిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం గత వారం పార్టీ జమ్మూకశ్మీర్ చీఫ్ గా కర్రాను నియమించింది.