తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ఓఎస్టీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా సి. గణేష్ కుమార్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన లైజన్ ఆఫీసర్గా కాంట్రాక్ట్ పద్ధతిలో రెండేళ్లపాటు తిరుమలలో పనిచేస్తారు. శ్రీవారి ఆలయానికి వెళ్లే వీవీఐపీల ప్రొటోకాల్ బాధ్యతలు చూడటంతోపాటు టీటీడీ నుంచి తెలంగాణ ఆలయాల అభివృద్ధికి నిధులు తీసుకొచ్చేందుకు ఆయన కృషి చేస్తారు.