డాలర్ తో పోలిస్తే రూపాయి సరికొత్తగా జీవితకాల కనిష్ఠానికి చేరుకుంది. చివరి రెండేళ్లలోనే అతిఘోరపతనం చవిచూసింది. వరుసగా ఏడో ఏడాదీ నష్టాలబాట పట్టింది.
నేడు 85.31 వద్ద ఓపెనైన రూపాయి 85.82 వద్ద కనిష్ఠానికి చేరుకుంది. ఆర్బీఐ జోక్యంతో కాస్త పుంజుకొని 85.52 వద్ద ముగిసింది. భారత ఎకానమీ గ్రోత్ తగ్గడం, ఇన్ప్లేషన్ పెరగడం, డాలర్ ఇండెక్స్ పుంజుకోవడం, FIlలు వెళ్లిపోవడమే పతనానికి కారణాలు.