భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
రిపోర్టర్ దుర్గాప్రసాద్
వాసు మెమోరియల్ స్మారక 18వ ఫుట్బాల్ టోర్నమెంట్ను శనివారం నాడు కేటీపీఎస్ ఓ అండ్ ఎం స్పోర్ట్స్ కార్యదర్శి మహేష్, మరియు పీలే శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ పోటీల్లో మూడు జిల్లాల నుండి 11 టీంలు పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గత 18 ఏళ్లుగా వాసు మెమోరియల్ టోర్నమెంట్ను నిర్వహించడం అభినందించదగ్గ విషయమని శ్రీనివాస్ మిత్రబృందాన్ని అభినందించారు. రెండు రోజుల పాటు జరిగే ఆటల పోటీల్లో ప్రతి క్రీడాకారుడు పోటీ తత్వంతో, మిత్ర భావంతో ఆటలు ఆడి మంచి క్రీడాకారులుగా మెలగాలని పిలుపు ఇచ్చారు రామకృష్ణ. ఆటల పోటీ నిర్వాహకులు ధనియాకుల రామకృష్ణ, ప్రవీణ్, సంజయ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.