శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా దాతలకు గదుల కేటాయింపును టీటీడీ రద్దు చేసింది.

అక్టోబరు 4 నుంచి 12 వరకు భక్తుల సౌకర్యార్థం టీటీడీలోని వివిధ ట్రస్టులకు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు గదుల కేటాయింపు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 4న ధ్వజారోహణం, అక్టోబర్ 12న చక్రస్నానం జరిగే రోజుల్లో మినహా మిగతా రోజులలో దాతలను దర్శనానికి అనుమతిస్తారు.