రాఖీ పౌర్ణమి రోజున TGSRTCలో రికార్డు స్థాయిలో ప్రయాణాలు నమోదయ్యాయి. ఆర్టీసీ బస్సుల్లో నిన్న ఒక్కరోజే 63.86 లక్షలమంది రాకపోకలు సాగించారు. 41.74 లక్షలమంది మహిళలు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వినియోగించుకున్నారు.

మహిళలకు మొత్తం 17కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులకు, డ్రైవర్లకు, కండక్టర్లకు, ఇతర సిబ్బందికి మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు.