లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ నటించిన చిత్రం ‘ఖైదీ’. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే మేకర్స్ ప్రకటించారు.
తాజాగా దీనిపై కార్తీ స్పందిస్తూ… ‘ఖైదీ 2′ చిత్రం 2025లో ప్రారంభమవుతుందని తెలిపారు. మళ్లీ బిర్యానీ బకెట్ తీసుకొనే సమయం వచ్చిందని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ చిత్రం ‘ఎల్సీయూ’లో భాగంగా రానుంది.