భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ                              
రిపోర్టర్ : దుర్గాప్రసాద్

    పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులు అర్పించిన పట్టణ కాంగ్రెస్ శ్రేణులు. భారత రత్నకు మన్మోహన్ సింగ్ అన్నివిదాల అర్హుడన్న నూకల రంగారావు. ఆధునిక భారత ఆర్ధిక రూపశిల్పి, మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ పాల్వంచ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో KSP రోడ్డు లోని కాంగ్రెస్ పట్టణ కార్యాలయం నందు మన్మోహన్ సింగ్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు నివాళి కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. కావున కాంగ్రెస్ కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొనగలరు.

ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, పది సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థంగా నిర్వహించారన్నారు. వారి హాయాంలోనే ఉపాది హామీ పథకం మరియు సమాచార హక్కు చట్టం తెచ్చారని అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మన్మోహన్ సింగ్ గారికి భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ నివాళి కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష, జిల్లా INTUC అధ్యక్షులు SA జలీల్, కాల్వ భాస్కర్, చింతా నాగరాజు,పేటేటి నరసింహ రావు, బానోత్ రాము నాయక్,కొమర్రాజు విజయ్,ఓలపల్లి రాంబాబు , శనగ రాంచందర్, సాంబయ్య, ST సెల్ నాయకులు బట్టు మురళి నాయక్, లక్ష్మణ్ నాయక్, సుమన్ నాయక్ మైనారిటీ అధ్యక్షులు, చాంద్, ,యూత్  కాంగ్రెస్ నాయకులు, ఇజ్జగాని రవి గౌడ్, సమ్మెట అప్పారావు, నల్లమల సత్యం, ఆరుద్ర సత్యనారాయణ,శనగ రాంచందర్, SC సెల్ పట్టణ అధ్యక్షులు పెంకి శ్రీను, మైనారిటీ నాయకులు ఇమ్మానుయేల్, రఫీ, చారి, సేవాలాల్ , మాలు నాయక్,, కిలారు నాగ మల్లేశ్వర రావు, మైలారం గణేష్ ,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ శశి,  వైస్ ప్రెసిడెంట్ జక్కుల రాము, వైస్ ప్రెసిడెంట్ (ఉమెన్ ) స్వాతి రెడ్డి,రూరల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బండి నాగరాజు, పాల్వంచ పట్టణ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ భార్గవ్,  వైస్ ప్రెసిడెంట్ (OBC) గండు భరత్, నూకల సతీష్, రాము, వేమా రాంబాబు,మహిళా కాంగ్రెస్ నాయకురాలు మురారి పద్మ తదితరులు పాల్గొన్నారు.