భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
రిపోర్టర్ : దుర్గాప్రసాద్
స్థానిక పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్ లోగల త్రివేణి పాఠశాలలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి గణ నివాళి అర్పించారు. పాఠశాల ప్రిన్సిపల్ జి. నేతాజీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ గారి చిత్రపటానికి పాఠశాలలోని ఉపాధ్యాయులంతా కలిసి పూలతో అంజలి ఘటించి. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి గారు, సి ర్ ఓ కాట్రగడ్డ మురళి కృష్ణ గారు మన్మోహన్ గారి పట్ల సంతాపం తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కిడ్స్ ఇంచార్జ్ శ్రీమతి జి. కవిత గారు, క్యాంపస్ ఇంచార్జ్ సురేష్ గారు మరియు పాఠశాల ఉపాధ్యాయుల పాల్గొన్నారు.