భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ                                    

రిపోర్టర్ దుర్గాప్రసాద్

స్థానిక పాల్వంచ పట్టణం లోని దమ్మపేట సెంటర్ లో గల త్రివేణి పాఠశాలలో సెమి క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి.

ముందుగా పాఠశాల ప్రాంగణాన్ని అంతా విద్యుత్ దీపాల వెలుగుల్లో దేదీవ్యమానంగా తయారుచేసారు. పాఠశాల ప్రిన్సిపల్ జి. నేతాజీ గారి ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయుల సమూహము తమదైన శైలిలోని ఆ యేసునాధున్ని స్తుతించారు.

విద్యార్థులకు ఆయనలోని సుగుణాలను అర్థమయ్యేలా వివరించారు. తరువాత పాఠశాలలోని చిన్నారి బాల బాలికలు విచిత్ర వేషధారణలో భాగం అయినటువంటి శాంతాక్లాజ్ మరియు దేవదూతల వేషాల్లో అందరిని అలరించి మిఠాయిలు పంచి పెట్టారు.

ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి గారు మరియు సి.ర్.ఓ. కాట్రగడ్డ మురళి కృష్ణ గారు పాఠశాలలోని ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ఇతర బోధనేతర సిబ్బంది కి క్రిస్మస్ పండగ శుబాకాంక్షలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కిడ్స్ ఇంచార్జ్ జి. కవిత, క్యాంపస్ ఇంచార్జ్ సురేష్ గారు మరియు పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.