రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే 19 జిల్లాల్లో వంద శాతం పూర్తయ్యింది. మరోవైపు సర్వే వివరాల నమోదు ప్రక్రియ వేగంగా జరుగుతోంది.

జిల్లాలతో పోలిస్తే జీహెచ్ఎంసీలో అనుకున్నంత వేగంగా జరగడం లేదు. నిన్నటి వరకు 82.4 శాతం సర్వే పూర్తయ్యింది. 4,41,225 ఇళ్లలో సమాచారం సేకరించాల్సి ఉంది. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు సేకరించిన సమాచారం కంప్యూటరీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.