వర్షాలు, వరదలతో ఏపీ, తెలంగాణలో భారీగా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో వెంటనే ఏరియల్ సర్వే చేయించాలని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తెచ్చారు.

దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఏరియల్ సర్వేకు కేంద్రం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో అధికారికంగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేయనుంది.