తెలంగాణలోని వెంకన్న భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖలు వారానికి రెండుసార్లు అనుమతిస్తామని టీటీడీ అధికారికంగా ప్రకటించింది.

ఈ మేరకు దర్శనానికి వచ్చిన వారికి ప్రత్యేక దర్శనం అయ్యేలా చూస్తామని బోర్డు తెలిపింది. తిరుమలలో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించకపోవడంపై ఇటీవల తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.