స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రేవంత్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఎంపీటీసీ స్థానాల పునర్విభజన కోసం అధికారులు ఇప్పటికే జిల్లాల నుంచి నివేదికలు తెప్పించారు. ఈరోజు అసెంబ్లీ సమావేశం తర్వాత పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.