ఎమ్మెల్యే పాయం ఘన స్వాగతం పలికిన మెడికల్ సిబ్బంది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కరకగూడెం మండలం
రిపోర్టర్ : దుర్గా ప్రసాద్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండల పరిధిలోని ప్రాథమిక వైద్యశాలలో నూతన 102, అంబులెన్స్ లను పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు  DMHO భాస్కర్ నాయక్  జెండా ఊపి ప్రారంభించారు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కారం మధు  ఎమ్మెల్యే,కి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా *ఎమ్మెల్యే పాయం  మాట్లాడుతూ…

గతంలో ప్రభుత్వం ఆసుపత్రికి అంబులెన్స్ కేటాయించాలంటే గత ప్రభుత్వం ద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో  సీఎం *గౌ!!శ్రీ!! ఎనుముల రేవంత్ రెడ్డి  నేతృత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ఏదైనా ప్రమాదానికి గురైతే వెంటనే ఆసుపత్రికి వెళ్లే విధంగా అంబులెన్స్ లను కేటాయించారని తెలిపారు
ప్రవేట్ హాస్పిటల్ లకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు అన్ని రకాల మెరుగైన వైద్యం అందిస్తూ, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు కూడా మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్  ప్రభుత్వమేనని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి వైద్య అవసరం వచ్చిన ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు, వెళ్లే అవసరం లేకుండా మన ప్రాంతంలోనే మెరుగైన వైద్యం అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం  కృషి చేస్తుందని తెలియజేసిన *పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌ!!శ్రీ పాయం వెంకటేశ్వర్లు.

ఈ యొక్క కార్యక్రమానికి DMHO భాస్కర్ నాయక్ గారు,కరకగూడెం ఎమ్మార్వో నాగ ప్రసాద్  మెడికల్ ఆఫీసర్ కారం మధు , కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇక్బాల్ హుస్సేన్  తాజా మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు