పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖలో తీసుకుంటున్న సంస్కరణలను సీఎంకు వివరించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.990కోట్లు, జల్ జీవన్ మిషన్ పథకానికి రాష్ట్ర వాటా రూ.500కోట్లు విడుదల చేస్తున్నాం. రాబోయే 5 ఏళ్లలో 17,500కి.మీ సీసీ రోడ్ల నిర్మాణం చేస్తామని అన్నారు.