భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
రిపోర్టర్ : దుర్గా ప్రసాద్

అంకితభావంతో ముందుకెళ్లాలి…
పోస్టల్ ఎస్పీ (ఉమ్మడి ఖమ్మం జిల్లా) స్థానిక పాల్వంచ పోస్ట్ ఆఫీస్ కార్యాలయము నందు శనివారం సాయంత్రం జరిగిన పోస్టల్ సిబ్బంది సమావేశంలో పాల్గొని మాట్లాడినారు.

ఈ సమావేశంలో పాల్వంచ సబ్ డివిజన్ పరిధిలోని గ్రామీణ తపాలా ఉద్యోగులు పాల్గొన్నారు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా పోస్టల్ శాఖ తీసుకొస్తున్న మార్పులను గ్రామీణ స్థాయిలో ప్రజలకు వివరించి పోస్టల్ శాఖ ద్వారా అందిస్తున్న పథకాలను వారికి చేరువ చేయాలని కోరినారు ప్రతి ఉద్యోగి సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే మనము అనుకున్న లక్ష్యాల్ని సాధించగలమని చెప్పినారు, ముఖ్యముగా తక్కువ ప్రీమియంతో అందే జీవిత బీమా పథకాలకు సంబంధించి ప్రజలను చైతన్యం చేయాలని ఆయన సూచించారు ద్వారా మనము గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు పరోక్షంగా సేవను అందించిన వారు అవుతాము అని తెలిపిరి.

ఈ కార్యక్రమములో పాల్వంచ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్  m.వీరన్న, IPPB మేనేజర్ సంజయ్, మెయిల్ ఓవర్సీస్ దుర్గాప్రసాద్, పాల్వంచ సబ్ పోస్ట్ మాస్టర్ నాగమణిషా, బ్రాంచి పోస్ట్మాస్టర్ బండి ఎల్లారావు తిలక్, రామారావు, సిద్దయ్య తదితర సిబ్బంది పాల్గొన్నారు.