హైటెక్ సిటీ తరహాలో హైదరాబాద్ శివారులలో కొత్తగా రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ శ్రీధర్ బాబు తెలిపారు.

హైదరాబాద్ లో రూ.100కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ‘డ్యూ’ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధులతో సచివాలయంలో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కొత్తగా మరో రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.