గతేడాది సెప్టెంబర్ లో ప్రారంభించిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద శిక్షణ, లబ్ధిపొందిన మహిళల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ కు రెండోస్థానం దక్కింది.

మొదటి స్థానంలో కర్ణాటక.. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా గుజరాత్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర ఉన్నట్లు కేంద్ర నైపుణ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ పథకం కింద ఏడాది కాలంలో 3,03,161 మందికి లబ్ధిచేకూరినట్లు వివరించింది.