మాదకద్రవ్యాల సంబంధిత ఫిర్యాదులకు మార్గం సుగమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా త్వరలోనే జాతీయ స్థాయిలో యాంటీ-నార్కోటిక్స్ హెల్ప్ లైన్ నంబర్ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

‘1933’ నంబర్ తో పాటు ఈమెయిల్ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యాంత్రాంగం సిద్ధమవుతోంది. దీనిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారని సమాచారం.