ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం కేజీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష పూచికత్తు సమర్పించాలని సూచించింది.

మార్చి 21న ఆయన ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మే 10 నుంచి జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు.