హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన ఎయిరిండియాకు సంబంధించిన విమానాలను ఆపరేషన్నల్స్​ కారణం చూపుతూ… రద్దు చేసింది యాజమాన్యం.

ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాలు రద్దు చేయడంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు అప్పటికే విమానాశ్రయం చేరుకున్న 40 మంది ప్రయాణీకులు.

ప్రయాణికులను శాంతింపజేసిన యాజమాన్యం తక్షణమే డబ్బులు రీఫండ్ చేశారు.

హైదరాబాద్ నుండి తిరుపతి, బెంగుళూరు, వైజాగ్, మైసూరు వెళ్లే విమానాలు, అక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన విమానాలు రద్దు అయ్యాయి.